పౌరసత్వ చట్టానికి ఎన్ ఆర్ సి లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో పోరాటం చేయాలని నందలూరులో ముస్లిం మైనారిటీల కోరికను మాజీ ఎమ్మెల్సీ రాజంపేట టీడీపీ ఇంచార్జీ భత్యాల చెంగల రాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు ఎన్ చంద్రబాబునాయుడికి వివరించారు. మంగళగిరి లోని టీడీపీ ఆఫీస్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ని మాజీ ఎమ్మెల్సీ రాజంపేట టీడీపీ ఇంచార్జీ భత్యాల చెంగల రాయుడు కలిశారు. నందలూరులో CAA,NRC బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు తెలపమని కోరుతూ ముస్లిం మైనారిటీలు అందించిన లెటర్ ను మాజీ ముఖ్యమంత్రి కి అందించారు. వారికి అండగా నిలుద్దామని ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడు అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి భారతాల శ్రీధర్ బాబు యాదవ్, కొండా శ్రీనివాసులు,చుక్కా యనాది తో కలిసి విన్నవించారు.
previous post