తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రులకు అన్న, ఆరాధ్యదైవం అయిన స్వర్గీయ డాక్టర్ నందమూరి తారకరామారావు 97వ జయంతిని పురస్కరించుకుని కడప జిల్లా రాజంపేట టీడీపీ ఇంచార్జీ మాజీ ఎమ్మెల్సీ భత్యాల చెంగలరాయుడు నివాళి అర్పించారు.
గురువారం ఉదయం 6:00గంటలకు గురుహోరా శుభమూర్తాన తిరుపతి పట్టణంలోని టౌన్ క్లబ్ సర్కిల్లో మహతి ఆడిటోరియం సమీపాన ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి భత్యాల చంగల్ రాయుడు గారు పూల మాలవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన మహానుభావుడు ఎన్టీఆర్ అని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు రూపొందించిన గొప్ప వ్యక్తి ఆయన అని భత్యాల కొనియాడారు.