26.7 C
Hyderabad
May 3, 2024 10: 38 AM
Slider హైదరాబాద్

ఇందిరానగర్ పేదలను తరలిస్తే ఊరుకోం

#bjpkukatpalli

ఇందిరా నగర్ లో ఏళ్ల తరబడి నివసిస్తున్న పేదలను అక్కడి నుండి తరలించాలని చూస్తే ఊరుకునేది లేదని, వారికి భారతీయ జనతాపార్టీ అండగా ఉంటుందని బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు కాంతారావు, వడ్డేపల్లి రాజేశ్వర రావు ఇతర బీజేపీ నాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులతో కలిసి ఆదివారం ఉదయం కూకట్ పల్లి డివిజన్ లో బస్తీబాట నిర్వహించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరా నగర్ లో తరాలుగా నివసిస్తున్న పేదలను ఇక్కడి నుండి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిని అరెస్టు చేయాలంటే ముందుగా బీజేపీ నాయకులను అరెస్ట్ చేయాల్సి ఉంటుందని, పేదలను తరలించాలని చూస్తే ఊరుకోబోమన్నారు. పేదల పక్షాన నిలబడి పోరాడతామని తెలిపారు.

Related posts

పాకిస్తాన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన చైనా

Satyam NEWS

బస్తీ ప్రజల బాధలు తీర్చేందుకు కార్పొరేటర్ పర్యటన

Satyam NEWS

రాజకీయ పార్టీలు మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టవద్దు

Satyam NEWS

Leave a Comment