38.2 C
Hyderabad
April 29, 2024 13: 34 PM
Slider కృష్ణ

మద్యం సరఫరా చేసే కంపెనీలన్నీ జగన్ వే

#purandaresvari

ఏపి ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసే కంపెనీల గుట్టును బీజేపీ ఎపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి బహిరంగ పరిచారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మద్యం తయారు చేసే డిస్లరీస్ యాజమాన్య వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేశామని అయితే నేటి వరకు ఆ వివరాలు ప్రభుత్వం చెప్పలేదని అందుకే తాము వెల్లడిస్తున్నామని ఆమె తెలిపారు. ఎపీ స్టేట్ బెవరేజెస్ కార్పోరేషన్ లో వందకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. వీటిలో 16 కంపెనీల ద్వారానే 74 శాతం మద్యం సేకరణ జరుగుతుంది.

వంద కంపెనీలుు ఉంటే.. 16 కంపెనీలకే ఎందుకు ప్రాధాన్యాత ఇస్తున్నారు. 2019 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు మద్యం పాలసీని మారుస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే మద్యం షాపుల నిర్వహణ మొదలు పెట్టారు. రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో నడుస్తున్నాయి. దశల వారీగా మద్యం నిషేధిస్తామన్న జగన్.. వారి అనుయాయులతో మద్యం తయారు చేసి పేదల ప్రాణాలతో ఆడుకుంటున్నారని పురందేశ్వరి అన్నారు. కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు 39 మంది మద్యం వల్లే ఆస్పత్రిలో ఉన్నారని తేలింది.

ఎపీలో అటువంటి పరిస్థితి లేదని వైసీపీ నాయకులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మరి వైద్యులు  చెబుతున్న అంశాలపై ప్రభుత్వం స్పందించదా అని ఆమె ప్రశ్నించారు. అదాన్ డిస్టలరీస్ 2019 లో హైదరాబాద్ సాగర్ సొసైటీ ప్లాట్ నెంబర్ 16 నుంచి లో ప్రారంభించారు. ఈ అదాన్ కంపెనీకి 1,160కోట్ల కేటాయింపు జరిగింది. చింతకాయల రాజేష్, పుట్టా మహేష్ కంపెనీల నుంచి కంపెనీలు లీజ్ కు తీసుకుని నడుపుతున్నారు.

వీరిని బెదిరించి.. అదాన్ డిస్లరీస్ కంపెనీ సబ్ లీజ్ కు తీసుకున్నారు. వారి నుంచి బలవంతంగా లాక్కుని బ్రాండ్ లను తయారు చేస్తున్నారు. అదాన్ డిస్లరీస్ వెనుక విజయసాయిరెడ్డి ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. 1863కోట్ల రూపాయలు మద్యం ఈ డిస్లరీస్ నుంచి సేకరణ జరుగుతుంది. చంద్రబాబు అన్నింటికీ అనుమతి ఇచ్చారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఎస్పీవై వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే మార్కెట్లోకి వచ్చింది. ఎస్పీ వై ఛాంపియన్, గోల్డ్ పేరుతో అనేక మద్యం ప్రొడక్టు తయారు చేస్తున్నారు.

అదాన్ వెనుక  విజయసాయిరెడ్డి, ఎస్పీవై వెనుక మిథున్ రెడ్డి ఉన్నారు. అదాన్, ఎస్పీ వై సంస్థల అడ్రస్ రెండూ  హైదరాబాద్ ఒకే చిరునామా. ఎంయస్ బయెటెక్ సంస్థ తరపున అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి  సబ్ లీజుకు తీసుకుని మద్యం సరఫరా చేస్తున్నారు. మాన్షన్ హౌస్, మంజీరా క్లాసిక్, అథెంటిక్, రెరెస్ట్ స్పిరట్ బ్రాందీ తయారు చేస్తున్నారు. యన్.కె. డిస్లరీస్ తరపున 1966.66కోట్ల మద్యం సరఫరా చేశారు. గతంలో ఎప్పుడూ వీళ్లు తయారు చేసిన కంపెనీల పేర్లే మార్కెట్ లో లేవని చెబుతున్నారు. ప్రకాశంజిల్లాలో పాల్ డిస్లరీస్ కు 931.32కోట్ల రూపాయలు మద్యానికి ఆర్డర్ ఇచ్చారు. సీఎం అనుచరులు బెదిరించి.. ఈ కంపెనీ లాక్కుని నడుపుతున్నారు.

బి.ఆర్.కె స్పిరిట్స్ 1040 కోట్ల రూపాయల మద్యం సేకరణ జరిగింది. శర్వాణి బేవరేజెస్ ను చంద్రారెడ్డి నడుపుతుండగా 426.60 కోట్ల మద్యం ఆర్డర్ ఇచ్చారు. బిడి.యస్.హెచ్ ఆగ్రో కు 328 కోట్ల రూపాయలు మద్యం ఆర్డర్ ఇచ్చారు. ఈ కంపెనీల పేర్లు, యజమానుల పేర్లు చెప్పాలని కోరినా ప్రభుత్వం స్పందించ లేదు. అందుకే మా బాధ్యతగా మద్యం తయారీదారులు, వారి వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు మేమే ప్రజలకు చెబుతున్నాం అని ఆమె స్పష్టం చేశారు.

మద్యం తయారు చేసినా, విక్రయించినా.. కఠినంగా శిక్షిస్తామని జగన్ ఎన్నికల సమయంలో చెప్పారు. మేము ఇప్పుడు మద్యం తయారీదారుల వివరాలు ప్రకటించాం. మరి ఇప్పుడు ఈ తయారీదారులను ఎప్పుడు అరెస్టు చేస్తారు. 56 వేల కోట్ల ఆదాయం మీకు వస్తుంటే.. 20 వేల కోట్ల ఆదాయం అని ప్రభుత్వం చెబుతుంది. మరి లెక్కల్లోకి రాని  ఆదాయం ఎక్కడకు వెళుతుందో జగన్ చెప్పాలి అని ఆమె డిమాండ్ చేశారు.

Related posts

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

Satyam NEWS

మదనపల్లె మార్కెట్‌లో టమాటా మోత

Bhavani

కరోనా హెల్ప్: టీవీ, సినీ కళాకారులు అధైర్యపడొద్దు

Satyam NEWS

Leave a Comment