28.2 C
Hyderabad
December 1, 2023 18: 12 PM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

HY13HIGHCOURT

కేసీఆర్ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఉన్న సచివాలయాన్ని కూల్చి వేసి కొత్తది నిర్మించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు అడ్డుపడింది. సచివాలయం కూల్చివేతపై 14వ తేదీ వరకూ స్టే ఇచ్చింది. సచివాలయం కూల్చివేత పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం కూల్చివేతపై స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సచివాలయ భవనాలను కూల్చొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. అయితే కొత్త సచివాలయ భవన సముదాయ​నిర్మాణంపై మంత్రివర్గ ఉపవర్గం సమర్పించిన నివేదికను నేడు తెలంగాణ కేబినెట్‌ ఆమోదించనున్న వార్తల నేపథ్యంలో కోర్టు ఈ తీర్పు వెలువడటం గమనార్హం. కేబినెట్‌ భేటీ అనంతరం సచివాలయ భవనాల కూల్చివేత, కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టాలని భావించిన కేసీఆర్‌ సర్కార్‌కు కోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది

Related posts

అభిమానులకు నందమూరి బాలకృష్ణ గ్రీటింగ్స్

Satyam NEWS

టెర్రిబుల్: బాలుడికి టీచర్ నుంచి లైంగిక వేధింపులు

Satyam NEWS

నిరంకుశంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!