ఆస్తిపన్ను పెంపుపై భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నది. మున్సిపల్ ఎన్నికల ముందు – మున్సిపాలిటీలలో పన్నులు ఎందుకు పెంచలేదు జగన్ గారు? అంటూ ట్విట్టర్ లో ప్రశ్నాస్త్రం సంధించారు నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్, బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి.
వైఎస్సార్సీపీ మునిసిపల్ ఎన్నికలలో ఓట్లు వేయించుకొని, ప్రజల ఓట్లతో గెలిచి, ఇప్పుడు ప్రజలకే అన్యాయం చేయడం న్యాయమా ? ప్రజలకు సమాధానం చెప్పండి ! అని ఆయన డిమాండ్ చేశారు.
మాట తప్పారు ..! మడమ తిప్పారు…! అంటూ బిజెపి చేస్తున్న ఆందోళన రోజు రోజుకు తీవ్ర తరం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ లో ఆస్తిపన్ను, చెత్త పన్ను పేరుతో ప్రజల నుంచి అన్యాయంగా పన్నులు వసూలు చేయడాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. (వీడియో చూడండి)