కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానిది కుటుంబ పాలన కాదని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ అన్నారు. విజయనగరం లో మోడీ ఎనిమిదేళ్ల పాలన సందర్భంగా పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నగరంలోని గురజాడ కళాభారతిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గడిచిన ఎనిమిదేళ్ల గా మోడీ జనరంజకమైన పాలన సాగిస్తున్నారన్నారు.
ఈ ఎనిమిదేళ్ల లో ఒక్క అవినీతి మచ్చ అవినీతి లేకుండా పాలన సాగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తన పధకాలు గా చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. సభలో ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అదే మన మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.
పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ గద్దె బాబూరావు మాట్లాడుతూ పార్టీ కార్తలను ఈ ప్రభుత్వం అణగదొక్కేందుకు యత్నిస్తోందన్నారు. ఈ విషయం ఎంపీ ..జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఇక పోతే పార్టీలో ఏ కార్తకర్తకు సమస్య ఎదురైన తనకు నేరుగా ఫిర్యాదు చేయోచ్చన నేను అక్కడ కు వెళ్లి పరిష్కరిస్త నన్నారు. కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని అధ్యక్షత వహించగా సుధీర్, హరనాధ్ తదితరులు పాల్గొన్నారు.