లాక్ డౌన్ కారణంగా ఆకలితో ఉన్నవారిని ఆదుకోవడానికి పలువురు ముందుకు వస్తున్నారు. అదే కోవలో బీజేపీ నగర ఉపాధ్యక్షుడు కన్నె రమేష్ యాదవ్ చేరారు. హైదరాబాద్ లోని కాచిగూడ డివిజన్ లోని మౌలానా ఆజాద్ నగర్ లోని పేద ప్రజలకు నిత్యావసర సరుకులను ఆయన అందచేశారు.
ఈ సందర్భంగా కన్నె రమేష్ యాదవ్ మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల పనిలేక ఇంటికే పరిమితం కావడంతో వారు రోజూ కూలినాలి చేసుకుని జీవనం సాగించే వారు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆకలితో అలమటిస్తున్న అలాంటి పేద ప్రజలను ఆదుకోవడం మానవధర్మం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బి. సంతోష్, సుభాష్ పటేల్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.