క్షయ వ్యాధి(టిబి)పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లక్కవరం గ్రామ పంచాయతీ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన టిబి వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఉద్దేశించి డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు,బరువు తగ్గడం, కళ్లెలో రక్తం జీరలు,ఆకలి మందగించడం, రాత్రి వేళల్లో జ్వరం,చెమటలు పట్టడం వంటి లక్షణాలు కలిగిన వారు వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి టిబి నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలని అన్నారు.
టిబి వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటుగా చికిత్స కాలంలో వారికి పోషకాహారం నిమిత్తం నెలకు 500 రూపాయలను ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. సకాలంలో మందులు వాడనటువంటి టిబి వ్యాధిగ్రస్తుల వల్ల సంవత్సరములో 12 నుంచి 15 మందికి వ్యాధి వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సౌజన్యనరేష్ ,టిబి నోడల్ పర్సన్ ఇందిరాల రామకృష్ణ, టిబి సూపర్వైజర్ మమత,గ్రామకార్యదర్శి గిరిజ కుమారి, ఉదయగిరి శ్రీనివాస్,ల్యాబ్ టెక్నీషియన్ రమేష్,ఆశా కార్యకర్తలు,హర్ష కుమారి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్