లాక్ డౌన్ తో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు బీజేపీ నేతలు.
హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ సురబీ రవీందర్ నేతృత్వంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
ఇందులో భాగంగా లాక్ డౌన్ తో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడద్దనే ఉద్దేశ్యంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు నిత్యావసరాలను అందిస్తున్నామని, సరకులు అవసరమైన వారు టోకెన్లు తీసుకోవాలని, ఆరోజు సరకులు దొరక్కపోతే, మరునాటి కోసం టోకెన్లు ఇస్తామని, పూర్తి కోవిడ్ నిబంధనల ప్రకారమే సరకుల పంపిణీ చేస్తామని సురబీ రవీందర్ అన్నారు.
నిరుపేదలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.