టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ చేసిన విజ్ఞప్తి మేరకు.. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ నాన్ అక్రిడిటేటెడ్ జర్నలిస్టులకు సైతం వ్యాక్సిన్ వేయడానికి అనుమతించారు. అక్రిడిటేషన్ కార్డు లేని జర్నలిస్టులు తమ సంస్థ ఐడీ కార్డు చూపించి.. రిక్కాబజార్ హై స్కూల్లో కోవిడ్ వ్యాక్సిన్ పొందాలని TUWJ, Khammam నాయకులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్ కోరారు. కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకుని కరోనా బారి నుంచి.. మీరు.. మీ కుటుంబ సభ్యులు రక్షణ పొందాలని వారు కోరారు. తమ విజ్ఞప్తి కి స్పందించి ఈ నిర్ణయం తీసుకున్న జిల్లా కలెక్టర్ కర్ణన్ కి వారు ధన్యవాదాలు తెలిపారు.