కడప నగరంలోని పుత్త ఎస్టేట్లో, నూతన టిడిపి పార్లమెంట్ కార్యాలయాన్ని కమలాపురం ఇంచార్జ్ పుత్త నరసింహారెడ్డి నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు పుత్త చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన టిడిపి పార్లమెంట్ కార్యాలయంలో, ఉదయం నుంచి హోమాలు పూజ కార్యక్రమాలను పుత్త నరసింహారెడ్డి వారి సతీమణి నిర్వహించారు. నూతన టిడిపి పార్లమెంట్ కార్యాలయం వద్దకు జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఇన్చార్జిలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు పుత్త లక్ష్మిరెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున,టిడిపి పార్లమెంట్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
previous post