కరీంనగర్లోని తన కార్యాలయంలో నిర్బంధ దీక్షకు దిగిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ను పార్టీ నేతలు ఆస్పత్రికి తరలించారు.
ఆయన షుగర్ లెవెల్స్ పడిపోతుండటంతో ప్రభుత్వ వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. అనంతరం హుటాహుటిన అంబులెన్స్లో నగరంలోని అపోలో రీచ్ ఆస్పత్రికి తరలించారు.
సంజయ్ను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో భాజపా కార్యకర్తలు భారీగా ఆయన కార్యాలయం వద్దకు చేరుకున్నారు.