39.2 C
Hyderabad
April 28, 2024 12: 53 PM
Slider నల్గొండ

తెలంగాణ ప్రజలు బిజెపి పార్టీని నమ్మరు

#sanampudi

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతుబంధు సంబరాల్లో భాగంగా ఆదివారం సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి,మున్సిపాలిటి  వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,

జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి,తెరాస పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి,పట్టణ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం  శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమం నిర్వహించాలని,దాన్యంతో జై కెసిఆర్ అని తమకున్న అభిమానాన్ని  చాటుకున్నారని అన్నారు.

హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఊరు వాడల్లో అంబరాన్ని తాకేలా సంబరాలు నడుస్తున్నాయని అన్నారు.   బిజెపి నాయకులు అబద్ధాలతో కాలం గడుపుతున్నారని,ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని,బిజెపి పార్టీని చూసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారని, కరోనా తీవ్రత అధికంగా ఉన్న సమయంలో దొంగ దీక్షలు పెట్టి ఉద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని,వారికి స్థానికంగా నాయకులు లేక పక్క రాష్ట్రాల సిఎం లను తెచ్చుకొని అవగాహన లేని స్క్రిప్టు రాసి ఇస్తున్నారని అన్నారు.

బిజెపి కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు నడుస్తున్నాయని కితాబు ఇచ్చారని,

కానీ స్థానిక బిజెపి నాయకులు ఆ విషయాన్ని గుర్తించడంలో విఫలమవుతున్నారని, ఏదో ఒక విమర్శ చేయాలి అనే ఆలోచనతో అసత్యాలను మాట్లాడుతూ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనే బిజెపి పార్టికి పరాభవం తప్పదని,అన్ని రంగాల ప్రజలని జీఎస్టీ పేరుతో వసూలు చేస్తున్న పెద్ద కార్పొరేట్ సంస్థ బిజెపి నే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Satyam NEWS

వీఆర్ఏ ల ధర్నా…యాచకునికి వినతి పత్రం…

Satyam NEWS

4 రోజుల్లో పోడు పట్టాల పంపిణీ పూర్తి చేయాలి

Bhavani

Leave a Comment