నకిలీ విత్తనాలతో సోయా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సోయా రైతులు నేడు JDAఆఫీస్ ముందర ధర్నా నిర్వహించారు. సోయా రైతులకు మద్దతుగా బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ వచ్చి వారితో మాట్లాడారు. వారికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ దాదాపుగా ఇరవై రోజుల నుంచి రైతులు JDAఆఫీస్ చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. డూప్లికేట్ సోయా విత్తనాలు సరఫరా చేసిన కాంట్రాక్ట్ డీలర్ పై కేసు పెట్టాలని రైతులు కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు.
అదేవిధంగా రైతులను ఆదుకోవాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ JDA వెంకట్ మాట్లాడుతూ 4 or 5 రోజులలో రైతులకు డబ్బులు ఇచ్చే విధంగా చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.