అగ్రవర్ణాల వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ సర్పంచ్ చింత ఝాన్సీ ని తెలంగాణ మాలమహానాడు నేడు పరామర్శించింది.
అగ్రవర్ణాలకు చెందిన ఆనంద్ రెడ్డి, నరసింహారెడ్డి, సాయిబాబా, గ్రామ కార్యదర్శి రామస్వామి వేధింపులు భరించలేకే ఝాన్సీ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్య తెలిపారు.
ఆమె ఆత్మహత్య యత్నానికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి వారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు చిలకమర్రి నరసింహులు దృష్టికి తీసుకుపోయామని ఆయన తెలిపారు.
అదేవిధంగా ఆమె ఎన్నో పర్యాయాలు విన్నవించినా కూడా స్పందించని అధికారులు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కడం బాల్రాజ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు, రాష్ట్ర కార్యదర్శి పంబల సుధాకర్,
రాష్ట్ర నాయకులు సామ బంగారయ్య, పొంగూరు మండల అధ్యక్షులు దొడ్డి విష్ణు, గౌరవ అధ్యక్షులు అంతయ్య నందు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు