గత తొమ్మిది సంవత్సరాలుగా దళిత యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన నూట ముప్పై తొమ్మిది మానవ మృగాలను అరెస్ట్ చేసి ఉరితీయాలని కొల్లాపూర్ భారతీయ జనతా మోర్చా నాయకులు డిమాండ్ చేశారు.
గురువారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు బీజేవైఎం ఆధ్వర్యంలో దళిత యువతిపై జరిగిన అన్యాయాన్నికి ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ గౌడ్ మాట్లాడారు. దళిత యువతి సరితపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో మాజీ ఎంపీ కవిత పిఏ, ఎస్ఎఫ్ఐ,స్వేరో గుండాలు ఉన్నారన్నారు.
మిగతా మానవ మృగాలు అనేక రకాలుగా యువతిని హింసించారని పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లుగా ఆ యువతిని క్యాంపులో పేరుతో ఎస్ఎఫ్ఐ, స్వేరో గుండాలు ఆ యువతిని మనభంగలు చేశారన్నారు. ఈ విషయాన్ని స్వయంగా బాధితురాలు చెప్పుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందని, ఎంత మంది యువతులు బలియైతే ప్రభుత్వంలో చలనం వస్తుందన్నారు.
వెంటనే 139 మానవ మృగాలను అరెస్టు చేసి సిబి,సి ఐ డికి అప్పగించాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఆ మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుందన్నారు. లేనియెడల బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
అదే విధంగా ఎస్ఎఫ్ఐని బ్యాన్ చెయ్యాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు భరత్ చంద్ర, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కాకి సత్యనారాయణ గౌడ్,పదిర భీమేష్,మెంటే శివ కృష్ణ, శివ,కురుమయ్య,వెంకటేష్, బడా చందు, బిజ్జ శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.