సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేవైఎం రాష్ట్ర పిలుపుమేరకు ఈరోజు ములుగు పట్టణంలో లో కాగడా ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమ కాలంలో తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి నేడు ప్రభుత్వం లోకి రాగానే MIM కు భయపడి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
నిజాం నిరంకుశ పాలను తలపిస్తూ కెసిఆర్ పరిపాలన సాగిస్తున్నారని ఆయన అన్నారు. ఉద్యమ సమయంలో పనిచేసిన తెలంగాణవాదులు టీఆర్ఎస్ కు రాజీనామాలు సమర్పించి బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో లో బీజేవైఎం జిల్లా నాయకులు దొంతి రెడ్డి రాకేష్ రెడ్డి కొత్త సురేందర్ బీజేపీ రాష్ట్ర నాయకులు తక్కలపల్లి దేవేందర్ రావు అజ్మీర కృష్ణవేణి నాయక్
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్ గాజుల కృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి అడప బిక్షపతి కార్యదర్శి శ్రీలమతుల రవీంద్ర చారి
బిజెపి మండల అధ్యక్షులు ఇమ్మడి రాకేష్ యాదవ్ భూక్య జవహర్లాల్ ఎర్రం గారి విరను మద్దినేని తేజ రాజు తదితరులు పాల్గొన్నారు.