ఒక దళితుడికి శిరోముండనం చేసిన కేసులో సంబంధిత ఎస్సైని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎస్ ఐ ఫీరోజ్ షా తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్ లను సస్పెండ్ చేశారు.
రాజమండ్రి అర్బన్ జిల్లా సీతానగరం పోలీసు స్టేషన్ లో దళిత యువకుడు ఇందుమిల్లి ప్రసాద్ పై ఇసుక లారీని ఆపిన సంఘటనలో ఒక వైసీపీ నాయకుడు ఇచ్చిన మౌఖిక ఫిర్యాదు తో పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేయించారు.
ఈ సంఘటన పోలీసుల కళ్ల ముందే పోలీస్ స్టేషన్ లోనే చేసినట్లు ప్రాధమిక దర్యాప్తులో రుజువు కావడంతో సంబంధిత వ్యక్తులను సస్పెండ్ చేశారు. నేడు అరెస్టు చేసినట్లు అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్ పెయ్ తెలిపారు.