42.2 C
Hyderabad
May 3, 2024 17: 36 PM
Slider నిజామాబాద్

జుక్కల్ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ

#BJP Jukkal

సిద్దిపేట జిల్లా  దుబ్బాక ఉప ఎన్నికల ప్రక్రియలో భాగంగా  భాజపా అభ్యర్థి రఘునందన్రావు  గెలుపొందడంతో  జుక్కల్ నియోజకవర్గంలో   పార్టీ శ్రేణులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా భాజపా అధ్యక్షురాలు, మాజీ శాసనసభ్యురాలు అరుణతార మాట్లాడుతూ తెరాస పార్టీ ఎన్ని కుయుక్తులు చేసినప్పటికీ భాజపా అభ్యర్థికి దుబ్బాక ప్రజలు పట్టం కట్టారన్నారు.

తెరాస పతనం దుబ్బాక నియోజకవర్గం నుండే  ప్రారంభం అయిందని  ఆమె అన్నారు. కార్యక్రమంలో ఆమెతోపాటు బిచ్కుంద భాజాపా అధ్యక్షులు కిష్టారెడ్డి  ,మద్నూర్ అధ్యక్షులు హనుమాన్లు,

జుక్కల్ అధ్యక్షులు ప్రశాంత్ పటేల్, పెద్దకొడప్గల్ అధ్యక్షులు హనుమాన్లు, పిట్లం అధ్యక్షులు చంద్రయ్య ,నిజాంసాగర్ అధ్యక్షుడు   విశ్వనాథ్ తో పాటు భాజపా శ్రేణులు ఉన్నారు.

Related posts

పంట నమోదు కార్యక్రమానికి రైతులకు ఆహ్వానం

Satyam NEWS

ఫుల్లుగా తాగి మీడియాకు దొరికిన మధిర అధికారులు

Satyam NEWS

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో చండీహోమం

Satyam NEWS

Leave a Comment