సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల ప్రక్రియలో భాగంగా భాజపా అభ్యర్థి రఘునందన్రావు గెలుపొందడంతో జుక్కల్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా భాజపా అధ్యక్షురాలు, మాజీ శాసనసభ్యురాలు అరుణతార మాట్లాడుతూ తెరాస పార్టీ ఎన్ని కుయుక్తులు చేసినప్పటికీ భాజపా అభ్యర్థికి దుబ్బాక ప్రజలు పట్టం కట్టారన్నారు.
తెరాస పతనం దుబ్బాక నియోజకవర్గం నుండే ప్రారంభం అయిందని ఆమె అన్నారు. కార్యక్రమంలో ఆమెతోపాటు బిచ్కుంద భాజాపా అధ్యక్షులు కిష్టారెడ్డి ,మద్నూర్ అధ్యక్షులు హనుమాన్లు,
జుక్కల్ అధ్యక్షులు ప్రశాంత్ పటేల్, పెద్దకొడప్గల్ అధ్యక్షులు హనుమాన్లు, పిట్లం అధ్యక్షులు చంద్రయ్య ,నిజాంసాగర్ అధ్యక్షుడు విశ్వనాథ్ తో పాటు భాజపా శ్రేణులు ఉన్నారు.