39.2 C
Hyderabad
May 3, 2024 14: 16 PM
Slider నిజామాబాద్

రైతు రుణమాఫీ చేయాలని బిజెపి డిమాండ్

#BJP Bichkunda

రైతు రుణమాఫీ చేయాలని, రైతుబంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిచ్కుంద మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వెంకట్రావుకు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పత్తి రమేష్ వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018సంవత్సరంలో రైతు బందు పథకం డబ్బులు ఏ ప్రాతిపదికన అర్హులైన రైతులందరికీ రైతుల ఖాతలో జమ చేశారో ఈసారి కూడా అదే విధంగా జమ చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానంలో ఎకరానికి ఐదువేలు చొప్పున ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

లక్ష లోపు రుణాలున్న వారికి మాఫీ చేస్తామన్న హామీ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని కానీ రెండవసారి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినప్పటికీ  ఇది వరకు ఒక్క రైతు రుణ మాఫి కూడా కాలేదన్నారు. ప్రస్తుతం పంటలు వేసుకునే సమయం దగ్గర పడిందని, వెంటనే ప్రభుత్వం స్పందించి రైతు రుణమాఫీ చేసి వెంటనే రుణాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన వినతిపత్రంలో కోరారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నాయకులు దుబ్బ గంగాధర్, పసికే ప్రకాష్, మంచి  సిద్దరాములు, సందీప్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విభజన సమయంలో విడిపోయిన సోదరుడిని కలుకోడానికి పాక్ అంగీకారం

Satyam NEWS

తెలంగాణ ప్రజల గుండె చప్పుడు టీఆర్ఎస్

Satyam NEWS

తెలంగాణ వడ్లు కొనాల్సిందే

Sub Editor 2

Leave a Comment