కలియుగ దైవం ఆ వెంకన్నను దర్శించాలంటే…ఎన్నో వ్యయప్రయాసలకోర్చితే గాని ఏడుకోండలవాడి దర్శనం జరగదు. ఇంట్లో..ఒంట్లో..గుడిలో ఇలా నమ్మకం ఉన్న చోట ప్రతీ ఒక్క రూ మొక్కుకుని..ఆ తిరుమల వెంకన్న దర్శనం చేసుకుంటారు.అయితే సామాన్యులైన…ఆ గర్భ శ్రీమంతులైన…వెంకన్న దగ్గర కు వచ్చే సరికి అంతా సమానమే.
ఇలా అనుకునే….విశాఖ నుంచీ తిరుమల వెళ్లేందుకు… చాలా మంది… తిరుమల ఎక్స్ ప్రెస్ రైల్ ను నమ్ముకుని..రిజర్వేషన్లు చేయించుకుని..మరీ బయలుదేరారు.అదీ వేసవి సీజన్ కావడంతో… ఏసీ కంపార్ట్మెంట్లను నెల రోజుల ముందు నుంచీ బుక్ చేసుకుని వెంకన్న దర్శనం రైలు ఎక్కారు… విశాఖ రైల్వే స్టేషన్. హమ్మయ్య.. ట్రైన్ ఎక్కేసాము..అదీ ఏసీ కంపార్ట్మెంట్..అని ప్రయాణీకులు అనుకుంటూ ఉండగా…
ఆ ఏసీ కంపార్ట్మెంట్లలో చల్లని వాతావరణం మచ్చుకైన లేకపోవడం…రాకపోవడంతో… గమనించిన సదరు బోగీల్లో ప్రయాణీకులు.. గగ్గోలు పెట్టసాగారు. ఏసీ కానీ కంపార్ట్మెంట్లలో సాధారణ గాలి వస్తుంది. ఏసీ కంపార్ట్మెంట్లు క్లోజ్ డ్ కావడం… లోపల చల్లదనం లేకపోవడం…తిరుమల ట్రైన్ అనకాపల్లి వరకు వచ్చిన…
ఏసీ లేకపోవడంతో ప్రయాణీకులు ఎవరికీ వారు… ఆన్ లైన్ ద్వారా కంప్లైంట్స్ ఇవ్వడం ప్రారంభించారు. పనిలో పనిగా..”సత్యం న్యూస్.నెట్ “కి సమాచారం అందడంతో.. ఇక గత్యంతరం లేక ప్రయాణీకులు క్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రచురించసాగింది.