ఏపీలో పెండింగ్ లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులు..వాటి సమస్య పరిష్కారానికై బీజేపీ పోరు యాత్ర కు సన్నద్దం అవుతోంది.ఈ మేరకు ఈ నెల ఏడవ తేదీ నుంచీ మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో యాత్ర పేరుతో ప్రజలకు అందున రైతులకు చేరువయ్యేందుకు సన్నద్దం అవుతోంది.
ఈ విషయాన్ని..ఆపార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని..ఇటీవలే బీజేపీ కండువ కప్పుకున్న ప్రభుత్వ మాజీ విప్. మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావులు తెలిపారు.
విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఉత్తరాంద్ర జల జీవన పోరు యాత్రను నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని అన్నారు. ముందుగా శ్రీకాకుళఃలో వంశ ధార. అ తర్వాత రాజం వద్ద మడ్డు వలస. ఆదే విధంగా తోటపల్లి మూడు ప్రధాన ప్రాజెక్టులను పార్టీ పరంగా సందర్శిస్తామని తెలిపారు
చివరి రోజు మడ్డు వలసలో బారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేసామన్నారు. ఇక ఈ సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం డబ్బులు సకాలానికి ఇస్తున్నా…పనులువ వేగవంతంగా అవటం లేదని..డీపీఆర్ రిపోర్ట్ లలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందన్నారు.
ఎప్పుడో గ్రౌండ్ అవ్వాల్సిన తోటపల్లి ప్రాజెక్టును..ఈ ప్రభుత్వం వచ్చి మూడేళ్లుఅవుతున్నా…ఇంతవరకు ముందుకు సాగలేదన్నారు. నవ రత్రాలు అంటూ ..తొమ్మిది సమస్యలతో జగన్ ప్రభుత్వం కాలం గడిపేస్తుందని రెడ్డి పావని అన్నారు.
ఈ పోరు యాత్రకు ఇంచార్చ్ గా మాజీ విప్ గద్దె బాబురావు నాయకత్వం వహిస్తారని తెలిపారు.అలాగే ఈమూడు రోజుల పాదయాత్రలో ఎమ్మెల్సీ మాధవ్, సీఎం రమేష్, సుజనా చౌదరి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజలు హజరవుతారని రెడ్డి,పావని,గద్దె బాబూరావులు చెప్పారు.