కరోనా విస్తృతి నేపథ్యంలో పేదలు పడుతున్న ఇబ్బందులు కొంతైనా తీర్చేందుకు హైదరాబాద్ బీజేవైఎం నాయకులు నడుంబిగించారు. ఆశాజ్యోతి ఫౌండేషన్ తో కలిసి ప్రతి రోజూ 500 మందికి ఆహారం సరఫరా చేసేందుకు సంసిద్ధులయ్యారు.
బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్త, ఆశాజ్యోతి ఫౌండేషన్ ఘంటా నంద కుమార్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. బీజేవైఎం నాయకులు శివరాం, సత్యనారాయణ, రవి కుమార్, ఆంజనేయులు, సురేష్, విజయకుమార్, ఆచారి తదితరులు ఈ మహత్కార్యంలో పాలుపంచుకుంటున్నారు. నేటి నుంచి ప్రతి రోజూ హైదరాబాద్ లోని అంబర్ పేట్ ప్రాంతంలో 500 మంది నిరాశ్రయులకు భోజనం అందిస్తారు.