కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి అన్ని ప్రముఖ సంస్థలు తమ వంతు సాయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్ బిల్డర్స్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని అందచేసింది. వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి కోటి రూపాయల విరాళం చెక్కును అందచేశారు.
previous post