ములుగు మండలం లోని జగ్గన్న పేట గ్రామం చిన్న గుంటూరు పల్లి లోని ఎస్సీ,ఎస్టీ వాడలలో నివసిస్తున్న 130 నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క నేడు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనాథలకు అండగా నిలుస్తున్న అంజి రెడ్డి ని శాలువా తో సీతక్క సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, రాజమౌళి, వార్డు సభ్యులు చరణ్ సింగ్,అంజి రెడ్డి, మల్లయ్య సాంబయ్య, సుక్రారం,అభిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవలే మరణించిన బానోత్ రెడ్యా నాయక్ కుటుంబాన్నీ ఆ తర్వాత పరామర్శించారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సీతక్క వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఇదే గ్రామానికి చెందిన బానోత్ సమ్మయ్య ఇటీవలే ప్రమాదం లో గాయపడగా అయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకొని ఆర్థిక సాయం అందించారు.
previous post
next post