30.7 C
Hyderabad
April 29, 2024 04: 57 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్‌లో రూ. 80 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

#HyderabadDrugs

హైదరాబాద్‌లో  భారీ ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్‌ నగర శివారులో సుమారు రూ.80 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు బస్సులో హైదరాబాద్‌ నుంచి ముంబయికి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

రూ.28.52 కోట్ల విలువైన 142.6 కిలోల మెఫెడ్రన్‌, రూ.3.1 కోట్ల విలువైన 31 కిలోల ఎపిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫ్యాక్టరీలో మెఫెడ్రిన్‌ తయారీకి సిద్ధంగా ఉంచిన 250 కిలోల ముడిసరకునూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన ఈ ముడిసరకు విలువ రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. గత మూడు రోజులుగా హైదరాబాద్‌, ముంబయిలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురిని అరెస్టు చేసిన అధికారులు.. రూ. 45లక్షల భారత కరెన్సీ, యూఎస్‌ డాలర్లు, ఈయూఆర్‌ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

Related posts

విశాఖలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం

Satyam NEWS

ప్రకాశం జిల్లాలో పూటుగా నాటు సారా

Satyam NEWS

అభివృద్ధి పనులు చూసి ఆకర్షితులవుతున్న నేతలు

Satyam NEWS

Leave a Comment