జనచైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం 254వ,వ్యక్తికి రక్తదానం చేశారు. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రయివేట్ హాస్పిటల్ లో ‘ఏ’ పాజిటివ్ రక్తం ఒక యూనిట్ అత్యవసరం అని జనచైతన్య ట్రస్ట్ ను సంప్రదించగా పి.వంశీ,పార సాయి,పిల్లి.శివశంకర్ లు తక్షణమే స్పందించి,ట్రస్ట్ ఉపాధ్యక్షుడు పిల్లి శివ శంకర్ తన మిత్రుడు వినోద్ కన్నా తో మాట్లాడి హాస్పిటల్ వద్దకు పంపి, ఏ పాజిటివ్ బ్లడ్ ఒక యూనిట్ రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా జనచైతన్య ట్రస్ట్ చైర్మన్ పారా సాయి మాట్లాడుతూ జనచైతన్య ట్రస్ట్ స్థాపించిన అనతికాలంలోనే 254 మందికి రక్తదానం చేయడం జరిగిందని అన్నారు.రక్తం అవసరం ఉన్నా ప్రతి ఒక్కరికి జనచైతన్య బ్లడ్ డొనేషన్ టీమ్ అన్ని వేళల అందుబాటులో ఉంటుందని అన్నారు.రక్తదానం చేసిన వినోద్ కన్నా కు ట్రస్ట్ తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్