39.2 C
Hyderabad
April 30, 2024 20: 25 PM
Slider నల్గొండ

రక్త దానం చేసి ప్రాణ దాతలుగా మారండి

#janachitanyatrust

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం లోని ఒక ప్రయివేట్ వైద్యశాలలో గర్భిణీ మహిళ కు ‘ఏ’ పాజిటివ్ రక్తం అత్యవసరం ఉన్న విషయాన్ని హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని జనచైతన్య ట్రస్ట్ సభ్యులు పినపారాళ్ళ వంశీ,పారా సాయి, పిల్లి శివశంకర్ లకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించిన జన చైతన్య ట్రస్ట్ అధ్యక్షుడు పారా సాయి అదే గ్రూప్ బ్లడ్ డోనర్ అయిన గాలి అంజయ్య ను సంప్రదించి సకాలంలో వైద్యశాలకు వద్దకు పంపించి ‘ఏ’ పాజిటివ్ రక్తం ఇప్పించారు.

అత్యవసర సమయంలో ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ బుధవారం జనచైతన్య ట్రస్ట్ నేతృత్వంలో 447వ,వ్యక్తికి రక్తదానం చేసిన గాలి అంజయ్య ను ట్రస్ట్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జనచైతన్య ట్రస్ట్ అధ్యక్షుడు పారా సాయి మాట్లాడుతూ అత్యవసర సమయంలో తాము సమాచారం అందించగానే వెనువెంటనే స్పందించి రక్తదానానికి స్వచ్చందంగా ముందుకు వస్తున్నా యువతకు జనచైతన్య ట్రస్ట్ తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలకు, యువతకు రక్తదానం చేయడం పట్ల ఇంకా అవగాహన కల్పిస్తూ,ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నామని పారా సాయి అన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

‘‘యువగళం’’పాదయాత్రతో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం

Bhavani

బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి…!

Satyam NEWS

సీఎం కేసీఆర్ తో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ భేటీ

Satyam NEWS

Leave a Comment