Slider మహబూబ్ నగర్

10వ తరగతి పూర్తి చేసిన వారికి శుభవార్త

#ellenisudhakararao

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థినీ,విద్యార్థులకు బిజెపి జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజవర్గ ఇంచార్జీ ఎల్లేని సుధాకర్ రావు శుభవార్త చెప్పారు. నియోజకవర్గంలోని పేద విద్యార్థులను టెక్నికల్ విద్యకు చేరువ చేయాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా  బీజేపి కొల్లాపూర్ శాఖ ఆధ్వర్యంలో  సమృద్ధ భారతీ రాష్ట్రీయ ట్రస్ట్,కేవైఎఫ్ సౌజన్యంతో ప్రముఖ కోచింగ్ సెంటర్ శ్రీ సాయిమేధా కోచింగ్ సెంటర్ వారిచే ఉచిత పాలిసెట్ కోచింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈ నెల 16వ తేదీ (ఆదివారం) రోజు ఉదయం 10 గంటలకు కొల్లాపూర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయం దగ్గర ఈ కోచింగ్ కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. కావున నియోజకవర్గంలోని 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంజనీర్ కావాలనే ఆశయం ఉన్న ప్రతి విద్యార్థినీ,విద్యార్థులు ఈ స్క్రీనింగ్ టెస్టుకు హాజరవ్వాల్సిందిగా కోరారు.

Related posts

జగన్ ను మెచ్చుకుంటున్నారు వైసిపిలోకి వస్తున్నారు

Satyam NEWS

ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన హుజూర్ నగర్ లారీ యజమానుల సంఘం

Satyam NEWS

ఎన్టీఆర్ విద్యాదీవెన తోనే ఈ స్థాయికి…

Bhavani

Leave a Comment