పేదల కష్టాలలో పాలుపంచుకుంటూ బిఎల్ఆర్ ట్రస్ట్ ఎల్లవేళలా ముందుంటుందని ట్రస్ట్ ప్రతినిధి నేమూరి మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. గుండెపోటుతో మృతి చెందిన చర్లపల్లికి చెందిన దర్శనం నరసింహ కుటుంబ సభ్యులకు సోమవారం బిఎల్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి ట్రస్ట్ ప్రతినిధి మహేష్ గౌడ్ 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు పేద విద్యార్థులకు, క్రీడాకారులకు విద్యా వైద్యం అందించేందుకు తమ ట్రస్టు ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు నాయకులు కడియాల బాబు, లక్ష్మయ్య, సురేష్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
సత్యంన్యూస్, మేడ్చల్ జిల్లా