నిష్కలంక రాజకీయ జీవితంతో, ప్రజలకు సుపరిపాలన అందించిన భారత పూర్వ ప్రధాని, భారతరత్న, శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వాజ్ పేయి కి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రామంతపూర్ లోనీ ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రి లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ , రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు విచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్ లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం రామంతపూర్ డివిజన్ యువ మోర్చా అధ్యక్షుడు పో రెడ్డి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినది. కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకట్ రావు, ప్రధాన కార్యదర్శులు సంకూరి కుమారస్వామి, వులుగొం డ నారాయణదాసు, తాళ్ల బాలకృష్ణ, ఈల్లిటం నరసింహారెడ్డి, సిహెచ్ రాములు, కంద కట్ల దయానంద రెడ్డి, పడిగం నగేష్, పలుగుల అంజయ్య, శైలేందర్, తమ్మలి రవి, శివ బన్వారా, జట్ట సాయి ధీరజ్, పంపాలా రామకృష్ణ, మామిండ్ల సుధాకర్ యాదవ్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.