39.2 C
Hyderabad
April 28, 2024 11: 35 AM
Slider విజయనగరం

వాహనదారులు పెండింగు చలానాలు కట్టేందుకు ఇకపై ప్రత్యేక డ్రైవ్….!

Collage Maker-14-Jul-2022-05.42-PM

వాహనదారులపై పెండింగులో ఉన్న ఈ-చలానాలను వసూలు చేసేందుకు ఇకపై ప్రతీ బుధవారం జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లుగా  విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పెండింగు ఈ-చలానాలను వసూలు చేసేందుకు జూలై 13న ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వాహనాలపై ఈ-చలానాలు పెండింగులో ఉంటే వాటిని ఆయా వాహనదారులు తప్పని సరిగా చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడ వాహన తనిఖీలు చేపట్టినా, మీ వాహనాలపై పెండింగులో గల ఈ-చలానాలను ఆన్లైనులో పెండింగుగా చూపిస్తాయన్నారు.

కావున, వాహనాలపైగల పెండింగు ఈ-చలానాలను తప్పనిసరిగా చెల్లించాలని, లేకుంటే మీ ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవన్నారు. రహదారి భద్రత, ప్రమాదాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగులో భాగంగా ప్రతీ రోజూ పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టి, రహదారి భద్రత ప్రమాణాలు, మోటారు వాహన చట్టంను అతిక్రమిస్తున్న వారిపై ఈ-చలానాలు విధిస్తున్నప్పటికీ, వాటిని చెల్లించడంలో వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఈ కారణంగా పెండింగు ఈ-చలానాల సంఖ్య పెరిగి పోతుందన్నారు. వాహనదారుల భద్రత, రక్షణ దృష్ట్యా విధించే ఈ-చలానాలను చెల్లించేందుకుగాను జిల్లాలో ఇకపై ప్రతీ బుధవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టే విధంగా అధికారులకు ఇప్పటికే ఆదేశాలను జారీ చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలు సహృదయంతో అర్థంచేసుకొని, తమ వాహనాలపై గల పెండింగు ఈ-చలానాలను వెంటనే చెల్లించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది ప‌లు  స్టేషను పరిధిలోగల ముఖ్య కూడళ్ళులో వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాల నంబర్లను ఈ చలానా యాప్లో చెక్ చేసి, ఆయా వాహనాలపై పెండింగులోగల 1255 ఈ-చలానాల నుండి .2,13,425/- ల నగదును వివిధ ఆన్లైను విధానాలు ద్వారా జమ చేయించామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

Related posts

కొల్లాపూర్ లో యూత్ జోడో బూత్ జోడో

Satyam NEWS

యాక్సిడెంట్ :ఖమ్మంలో ఇద్దరి మృతి 5గురికి గాయాలు

Satyam NEWS

ఇంపోజ్డ్:డ్రగ్స్ రవాణా కేసులో ఇద్దరి పంజాబీలకు జైలు

Satyam NEWS

Leave a Comment