శ్రీకాకుళం పట్టణంలో సోమవారం ఉదయం 10 గంటలకు సెవెన్ రోడ్ జంక్షన్ వద్ద గల లిఖిత్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ కార్యాలయంలో వంగవీటి మోహన రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహన రంగ డిసెంబర్ 26 చనిపోయిన రోజు సందర్భంగా ఆయనకు శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి యువజన సంక్షేమ సంఘం అధ్యక్షులు డా . గుండబాల మోహన్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన రంగ పెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు గా పేరు తెచ్చుకున్నారని తెలిపారు.
ఆయన 1947, జూలై 4 న కృష్ణ జిల్లా, ఉయ్యురు మండలం లోని కాటూరులో జన్మించారు అని తెలిపారు. ఈయన కాపు, ఇతర అణగారిన వర్గాలు, మైనార్టీ సంక్షేమ సంఘం నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఆయనను 1988 డిసెంబర్ 26న ఆయనను దారుణంగా హత్య చేశారు, ఆయన హత్య చేసినప్పటికీ ఇప్పటికీ పేద ప్రజలలో సముచిత స్థానము కలిగి ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తు రెడ్డి గురునాధరావు, ముత్తిరెడ్డి మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.