31.7 C
Hyderabad
May 2, 2024 08: 01 AM
Slider కడప

పట్టుబడ్డ ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిళ్ల ధ్వంసం

కడప జిల్లాలో గత రెండేళ్లలో అక్రమంగా రవాణా, విక్రయిస్తూ పట్టుబడ్డ ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు పోలీసు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఆదివారం ధ్వంసం చేశారు. నగర శివార్లలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని ఖాళీ స్థలంలో 2020-22 సం.ల మధ్య కాలంలో పట్టుబడ్డ వివిధ రాష్ట్రాలకు చెందిన 17,635 బాటిళ్లను రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు.

అదనపు ఎస్పీ(అడ్మిన్) పూజిత నీలం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు ఎస్.పి (అడ్మిన్) మాట్లాడుతూ జిల్లాలోని 32 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 151 కేసుల్లో స్వాధీన పరచుకున్న ఎన్.డి.పి.ఎల్ మద్యాన్ని జిల్లా ఎస్.పి గారి ఆదేశాల మేరకు ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. ధ్వంసం చేసిన వాటిలో 90 ఎం.ఎల్ టెట్రాప్యాకులు/ బాటిళ్లు 834, 180 ఎం.ఎల్ బాటిళ్లు 12,728, 375 ఎం.ఎల్ బాటిళ్లు 246 , 500 ఎం.ఎల్ 69, 750 ఎం.ఎల్ 2282 , లీటర్ బాటిళ్లు 1360 ధ్వంసం చేయడం జరిగిందని అదనపు ఎస్.పి తెలిపారు.

త్వరలోనే పలు కేసుల్లో పట్టుబడ్డ డి.పి.ఎల్ మద్యం ను ధ్వంసం చేయనున్నామని వివరించారు. ఇకపై కూడా దాడులు ముమ్మరంగా చేస్తామని, ప్రజలు అక్రమ మద్యంకు సంబంధించిన సమాచారంని డయల్ 100 కు సమాచారమివ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో కడప డి.ఎస్.పి బి.వెంకట శివారెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డి.ఎస్.పి చెంచుబాబు, ఎస్.ఈ.బి సూపరింటెండెంట్ శ్రీనివాస్, జిల్లాలోని పోలీసు, ఎస్.ఈ.బి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

చూపులేని వారు కూడా నోట్లను చూడవచ్చు

Satyam NEWS

పులివెందుల నుంచి వచ్చిన కారులో పుట్టల కొద్దీ బంగారం

Satyam NEWS

తెలంగాణ‌లో 27,077 క‌రోనా ప‌రీక్ష‌లు, 238 పాజిటివ్ కేసులు

Sub Editor

Leave a Comment