29.7 C
Hyderabad
April 29, 2024 10: 31 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ ప్రాంత విద్యార్ధులకు పుస్తకాలు పంచిన చింతలపల్లి

#kollapur

ఉస్మానియా యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న కొల్లాపూర్  ప్రాంత విద్యార్థులకు కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్ రావు ఉచితంగా పుస్తకాలు పంపిణి చేశారు. నేడు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ పట్టభద్రుల నిరుద్యోగ సంఘం అధ్యక్షులు రవి, ఉపాధ్యక్షులు ఈశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తకాల పంపిణి కార్యక్రమంలో పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీలో  పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న కొల్లాపూర్ ప్రాంత విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలను ఉచితంగా పంపిణి చేశారు. నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణి చేసిన జగదీశ్వర్ రావుని తెలంగాణ నిరుద్యోగ సంఘ నాయకులు శాలువాతో సన్మానించారు.

ఈ సందర్బంగా జగదీశ్వర్ రావు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ,తెలంగాణ ఉద్యమాలకు పురుడుపొసిన గడ్డగా గుర్తుచేసుకున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ విద్యార్థులు ఇచ్చిన పుస్తకలను సద్వినియోగం చేసుకొని ఒక్క నిమిషం కూడా సమయం వృధా చేయకుండా, పట్టుదలతో, దృఢశంకల్పంతో చదివితే మీరు అనుకున్న లక్ష్యం మీ చెంత చేరుతుందని,కస్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని,మీ తల్లితండ్రులకు,కొల్లాపూర్ నియోజకవర్గానికి మంచి పేరు ప్రతిష్ట సంపాదించాలని విద్యార్థులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వ విద్యాలయం డీన్, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సులర్, ప్రస్తుత మణిపూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ తిరుపతి రావు, తెలంగాణ నిరుద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవి, రాష్ట్ర ఉపా అధ్యక్షులు ఈశ్వర్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రమేష్ చెప్పాల ‘మా కనపర్తి ముషాయిరా’ ఆవిష్కరణ

Satyam NEWS

6,7,8 తేదీలలో మహిళాబంధు

Sub Editor 2

ప్రజా సమస్యల పరిష్కారానికి విజయనగరం పోలీసుల టెలి-స్పందన

Satyam NEWS

Leave a Comment