రాష్ట్రంలో జగన్ ది తుగ్లక్ పాలన మించి ఉందని టీడీపీ మాజీ ఎంఎల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఈ నెల 22 నుంచీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక నేతలతో చర్చించేందుకు బుద్దా వెంకన్న పార్టీ కార్యాలయంమైన అశోక్ బంగ్లాలో నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ… ఏ ఈ. ఒక్కరిని కదిపినా “ఇదేం ఖర్మరా బాబూ” అని జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అంటున్నారన్నారు.
విజయనగరం వచ్చిన నేను బయట టీ తాగుదామని టీ కొట్టుకు వెళ్లడంతో షాప్ వాడు ఇదేం ఖర్మ అండి బాబూ ఈ ప్రభుత్వం ఎంత వేగంగా దిగిపోతుందని అంటున్నారని బుద్దా వెంకన్న అన్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యే గా ఒక సారి ఎంపీ గా గెలిచిన ఆశోక్ గజపతిరాజు…లాంటి వ్యక్తులే…మామూలు ప్లాస్టిక్ గ్లాస్ లో టీ తాగుతూ ఉంటే… వైఎస్సార్సీపీ నేతలు వెండి ,బంగారం గ్లాసులలో తాగే స్థాయి లో జగన్ ప్రభుత్వం సంపాదించేలా చేసిందని ఆరోపించారు.ఈ పరిస్థితుల్లో ప్రజల నుంచీ వచ్చిన”ఇదేం ఖర్మరా బాబూ” అన్న నినాదమే తమ పార్టీ తీసుకుని… ప్రభుత్వం పై ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు పార్టీ అధినేత విజయనగరం జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారని బుద్దా వెంకన్న తెలిపారు.