వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులను పూర్తిగా విస్మరించిందని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు.
నేడు గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్ కి 1000 కోట్లు కేటాయించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అమరావతి లో టీడీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి నూతన దేవాలయం కి 25 ఎకరాలు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం దానిని 5 ఎకరాలకు కుదించడం దారుణమని అన్నారు.
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజినేయులు కూడా పాల్గొన్నారు.