28.7 C
Hyderabad
May 6, 2024 07: 24 AM
Slider గుంటూరు

బ్రాహ్మణులకు అన్యాయం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం

#vemuri anada surya

వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులను పూర్తిగా విస్మరించిందని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు.

నేడు గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్ కి 1000 కోట్లు కేటాయించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

అమరావతి లో టీడీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి నూతన దేవాలయం కి 25 ఎకరాలు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం దానిని 5 ఎకరాలకు కుదించడం దారుణమని అన్నారు.

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజినేయులు కూడా పాల్గొన్నారు.

Related posts

ఎస్సారెస్పీ మూడు గేట్లను ఎత్తిన మంత్రి కమలాకర్

Satyam NEWS

పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలి

Satyam NEWS

కరోనాతో చస్తున్నా వ్యాపారం వదలని నారాయణ

Satyam NEWS

Leave a Comment