తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. ఒక తమ్ముడు సొంత అక్కను అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగులపెట్టాడు. 54 సంవత్సరాల కోరుప్రోలు కుమారి ని ఆమె తమ్ముడు బొర్రా మోహన్ బాబు పెట్రోల్ తో దాడి చేశాడు. తన భార్యను దూరం చేసిందనే కోపంతో అతను ఈ హత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. సూర్యనారాయణపురం రామాలయం దగ్గర ఈ ఘటన జరిగింది. కోరుప్రోలు కుమారిని కుటుంబసభ్యులు వైద్యం కోసం జిజిహెచ్ కు తరలించారు. తమ్ముడు దాడి చేసి పారిపోతుండగా పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. బాధితురాలి దేహం 75శాతం పైగా కాలిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ భీమారావు తెలిపారు.
previous post