28.7 C
Hyderabad
April 26, 2024 08: 19 AM
Slider నల్గొండ

ఘనంగా మాలమహానాడు వ్యవస్థాపకుడు పివి రావు వర్ధంతి

#Malamahanadu

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మాల మహానాడు వ్యవస్థాపకులు పివి రావు వర్ధంతి నిర్వహించారు. పివి రావు మాల మహానాడు అధ్యక్షుడు కోలపూడి యోహాను ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి, పివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం జరిగిన సమావేశంలో మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు పోతుల జ్ఞానయ్య, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మిమల్ల నరసింహారావు మాట్లాడుతూ పివి రావు  కులం కోసం ఉన్నత ఉద్యోగాన్ని వదిలి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేసి అసువులు బాసిన అమర వీరుడని శ్లాఘించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పివి రావు మాల మహానాడు వ్యవస్థాపకుడు మేకల కోటేశ్వరరావు,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శీలం స్వరూప,  సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు సూదుల రాములు,మహిళా అధ్యక్షురాలు జిక్కి జైకన్య,  సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు సాలె గోపి,

హుజూర్ నగర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కందుల నాగలక్ష్మి, మఠంపల్లి మండల అధ్యక్షుడు మామిడి వీరస్వామి, హుజుర్ నగర్ పట్టణ అధ్యక్షుడు దగ్గుపాటి బాబురావు, మఠంపల్లి యూత్ అధ్యక్షుడు మామిడి నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అటవీ, రెవిన్యూ భూముల సమస్య పరిష్కరించాలి

Bhavani

ఏపిలో నాలుగు రోజుల పాటు బయటకు రావద్దు

Satyam NEWS

మానసిక వికాసానికి  క్రీడలు ఎంతో అవసరం

Satyam NEWS

Leave a Comment