తిరుమల తిరుపతి దేవస్థానం అధ్వర్యంలో జమ్ముకశ్మీర్ లో వెంకన్న ఆలయాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.జమ్మూ లో భారత్-పాకిస్థాన్ సరిహద్దులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి చురుకుగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్కడ ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలం ఎంపిక కోసం టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ శుక్రవారం ఆ రాష్ట్రానికి వెళ్తున్నారు.
గత ఏడాది డిసెంబరులో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో కశ్మీర్తోపాటు, వారణాసి, ముంబయిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణానికి తీర్మనించారు.అక్కడ ఆలయ నిర్మాణానికి జమ్ముకశ్మీర్ ప్రభుత్వం రెండు స్థలాలను గుర్తించి ట్రస్ట్ బోర్డు కు తెలిపింది.దీంతో ఈవో ఆ రాష్ట్రానికి వెళ్లి ఈ రెండు స్థలాలను పరిశీలించాక తమకు అనుకూలమైన ప్రాంతంలో టీటీడీ ఆలయం నిర్మించుకునే అవకాశం ఉంటుంది.అలాగే మిగతా చోట్లలో కూడా ఆలయాల నిర్మాణానికి స్థలాలు పరిశీలిస్తుందని ఈ.ఓ తెలిపారు.