38.2 C
Hyderabad
April 29, 2024 19: 24 PM
Slider విజయనగరం

ఆది శంకరుడే అందరి గురువు: డా.అంతర్ముఖానంద

ప్రపంచం అద్వైతాన్ని స్థాపించిన ఆది శంకరుల జయంతి ని నిర్వహించుకుందని….శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమ పీఠాధిపతి డా.అంతర్ముఖానంద..(శ్రీగురూజీ) అన్నారు. 32 ఏళ్ల ప్రాయంలో ఇంటిని వదిలి… యావత్ సమాజాన్ని ఆధ్యాత్మికతలోకి తీసుకువచ్చేందుకు దేశాటన చేసారన్నారు.జగద్గురువు ఆదిశంకరులు జయంతి సందర్భంగా ఏపీలోని విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో జగద్గురువు ఆదిశంకరులు జయంతి జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ స్వామీజీ సమాధి మందిరంలో పూజ…అలాగే శ్రీ స్వామి శివానందుల పరమహంసల వారి పీఠం వద్ద పూజతో పాటు ఆదిశంకరులు జయంతి నేపథ్యంలో… సద్గురువు పాదు కాష్ఠకం…శ్రీ గురుగీత…తదితరులు స్త్తోత్రాలు పఠించారు.అనంతరం… ఆశ్రమం లోని బౌధ్ధిక్ మండపం లో ఆశ్రమ పీఠాధిపతి, శ్రీగురూజీ.. ఆధ్యాత్మిక భాషణం జరిగింది.

ఈ మేరకు శ్రీ గురూజీ… దాదాపు రెండున్నర గంటల పాటు పద్మాసనంలో కూర్చొని… ఆది శంకరుల…గురించి శిష్యులకు తెలియచెప్పారు.ఈ ఉత్సవానికి… స్థానిక శిష్యులతో పాటు… విజయనగరం, శ్రీకాకుళం, సాలూరు, విశాఖపట్నం, విజయవాడ,హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచీ శిష్యులు హాజరయ్యారు.

Related posts

ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళన విజయవంతం చేయండి

Satyam NEWS

ఊహించని పిడుగు పాటు…22 ఏళ్ల వ్యక్తి మృతి…!

Satyam NEWS

ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నా టిఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment