దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని మతాల వారి పండుగలకు చేయూతనిచ్చే ప్రభుత్వం ఒక్క టిఆర్ఎస్ ప్రభుత్వమే అని హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని మఠంపల్లి, బక్కమంతులగూడెం, రఘునాధపాలెం, చౌటపల్లి గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే విధంగా చేసిన ఘనత కేసిఆర్ దే అన్నారు.
గ్రామాలలో అన్నిరకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. నియోజకవర్గలో ఒక్క నెలలోనే 2 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్దిదారులకు మంజూరు చేశామని, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే గిరిజన గురుకుల పాఠశాల , బంజారా భవన్ నియోజకవర్గానికి మంజూరైనాయని, అన్నారు.
మఠంపల్లిలో ITI కాలేజ్ నిర్మాణానికి పనులు త్వరగా జరుగుతున్నాయని,కొన్ని పార్టీలు కుల , మతాలపై రాజకీయాలు చేస్తున్నాయని వారికి ప్రజలే బుద్ధి చెపుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి పార్వతి కొండా నాయక్, జెడ్పిటిసి జగన్ నాయక్, మఠంపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నెం శ్రీనివాస రెడ్డి’ టిఆర్ఎస్ నాయకులు గుండా బ్రహ్మారెడ్డి , వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.