పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోన నేడు భారీ సభ జరిగింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీనివాసరావు పేట వద్ద నున్న గుంటూరు కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహ్మద్ ముస్తఫా, గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, GDCC బ్యాంక్ చైర్మన్ లాల్ పురం రాము, YSRCP రాష్ట్ర నాయకులు కావటి మనోహర్ నాయుడు, ఆతుకూరి ఆంజనేయులు మరియు ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.