38.2 C
Hyderabad
April 28, 2024 20: 15 PM
Slider విజయనగరం

డిప్యూటీ స్పీకర్ ఇంట్లో కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ…!

#calendar

ఆధ్యాత్మికత, భక్తి భావం పెంపొందించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు రావడం ఎంతైనా అభినందనీయమని  ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్  కనకల కృష్ణ తన సొంత డబ్బులతో రూపొందించిన భక్తి క్యాలెండర్ ను తన నివాసంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కనకల కృష్ణకు అభినందనలు తెలిపారు. ప్రజలలో భక్తి భావాన్ని పెంపొందించే విధంగా కనకల కృష్ణ తన సొంత నిధులతో క్యాలెండర్లను రూపొందించడం అభినందనీయం అన్నారు. కనకల కృష్ణ కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రజాహిత కార్యక్రమాలు కూడా చేపట్టడం ఇతరులకు స్ఫూర్తిదాయకమన్నారు. కనకల కృష్ణ మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారి సలహాలు సూచనలతో అటు రాజకీయాలు, ఇటు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ  నగర పార్టీ అధ్యక్షులు ఆసపు వేణు, నగరపాలక ఫ్లోర్ లీడర్ ఎస్ వి వి రాజేష్, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండల డైరెక్టర్ సంఘం రెడ్డి బంగారు నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు నడిపే న శ్రీనివాసరావు, విజయనగరం జడ్పిటిసి కెల్ల శ్రీనివాస రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ రెడ్డి గురుమూర్తి, జోనల్ ఇంచార్జ్ ఎవర్న కుమారస్వామి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు ఉన్నారు.

Related posts

ఒకే కుటుంబంలో అయిదుగురి అనుమానాస్పద మృతి

Satyam NEWS

బాబ్రీ విధ్వంసం కేసును కొట్టేసిన లక్నో సీబీఐ కోర్టు

Satyam NEWS

చైత్రోదయం

Satyam NEWS

Leave a Comment