ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిది అత్యంత క్రూరమైన మనస్తత్వమని టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. అడ్డదారిలో స్థానిక సంస్థలు కైవసం చేసుకోవడానికి ప్రజల ప్రాణాలతో ఆయన చెలగాటం ఆడారని అయ్యన్న పాత్రుడు అన్నారు.
కరోనా ప్రభావం లేదు అని సుప్రీంకోర్టుని కూడా తప్పుదోవ పట్టించాలని ముఖ్యమంత్రి చూశారని అన్నారు. ఆఖరికి సీఎస్ ని బెదిరించి బలవంతంగా కరోనా లేదు అంటూ లేఖ రాయించారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులో మొట్టికాయి పడ్డాక నిజాలు బయటపెట్టారు. మొన్నటి వరకూ లేని కేసులు ఉన్నట్టుండి ఎలా వచ్చాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా ని అరికట్టే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇక్కడ జరుగుతున్న పరిణామాల పై కేంద్రం దృష్టి పెట్టక పోతే ప్రజల ప్రాణాలు జగన్ గాల్లో కలిపేయడం ఖాయం అంటూ ఆయన వ్యాఖ్యానించారు.