సదర్న్ కాలిఫోర్నియాలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో నలుగురు మరణించారు. లాస్ ఏంజిలిస్ కు సుమారు 40 మైళ్ళ దూరంలోని కొరోనా మున్సిపల్ ఎయిర్ పోర్టు నుంచి బుధవారం బయల్దేరిన ఈ చిన్న విమానం టేకాఫ్ అయిన వెంటనే.. ఓ కంచెను ఢీకొని మంటల్లో మండుతూ పేలిపోయింది.ఇంజన్ లోని సాంకేతిక లోపమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదంలో నలుగురు మృతి చెందగా వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. సాంకేతిక లోపంను గుర్తించిన మొదట పైలట్ ఈ విమానాన్ని నడిపేందుకు చాలా ప్రయత్నించి విఫలమయ్యాడని తెలిసింది. చివరకు అతి కష్టం మీద ఈ ప్లేన్ టేకాఫ్ చేసినప్పటికీ కొద్దీ క్షణాల్లోనే కూలిపోయింది.ఈ ప్రమాదంపైకాలిపోర్నియా ఎయిర్ ఆథారిటీ విచారణ ప్రారంభించారు.