ఉప్పల్ నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న తమ వంతు పరిష్కారానికి కృషి చేస్తానని బిఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మల్లాపూర్ డివిజన్ నెహ్రూ నగర్ బ్లాక్ -2 కి చెందిన మహేందర్ కుమారుడు రవితేజ ఆల్ ఇండియా డొమెస్టిక్ క్రికెట్ కి ఎంపికైన సందర్బంగా సైనిక్ పూరి లోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం లో బండారి లక్ష్మారెడ్డి విద్యార్థిని అభినందించి బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ వంతు పరిష్కారానికి కృషి చేస్తానని టిఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పేద ప్రజలను, విద్యార్థులను ప్రతి ఒక్కరిని వారి సమస్యలు రీత్యా సహాయ సహకారాలు అందించి ఆదుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు శ్రీశైలం యాదవ్,దీపక్ కుమార్ సింగ్,ముత్యం రాజ్,ప్రవీణ్ నాయక్,నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా