39.2 C
Hyderabad
April 28, 2024 12: 40 PM
Slider ఖమ్మం

ప్రజాదరణ తట్టుకోలేకనే దాడులు

#congress

భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హత్ యాత్ర కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ అల్లరి ముకలు దాడులకు పాల్పడుతున్నాయని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ అన్నారు. జయశంకర్ భూ పాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి యాత్రకు భంగం కలిగించేందుకు స్థానిక ఎమ్మెల్యే తన టీఆర్ఎస్ రౌడీలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా  ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ సెంటర్ లో కె సి ఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం ఆయన మీడియతో మాట్లాడుతూ…అధికారం ఉందని దాడులకు చేయడం సిగ్గు మాలిన చర్య అని అన్నారు. అధికారం ఎవరి సొత్తూ కాదని హితవు పలికారు. అధికారం ఉంటే అభివృద్ధి చేయాలి కానీ దాడులు చేయించడం ఏంటని ప్రశ్నించారు.యావత్ దేశం మార్పు కోరుకుంటుందని అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించడం తప్పు గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవరెన్ని దాడులు చేసిన మడమ తిప్పే సంస్కృతి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు లేదని సమస్య ఉన్నచోటే ఎదురోడ్డి పోరాడుతామని హెచ్చరించారు.కాంగ్రెస్ పై టొమాటో, చెప్పులు కాదు మానవ బాంబ్ లతో దాడి చేసినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపదని ఈ సంస్కృతి దివంగత నేత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ నుండి నేర్చుకున్నామని తెలిపారు.అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు మహ్మద్ జావేద్,పాలేరు నియోజకవర్గ పి సి సి సభ్యులు రాయల నాగేశ్వరావులు మాట్లాడుతూ ఇటువంటి దాడులు పునరావృతం అయితే బి ఆర్ ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,నగర కాంగ్రెస్ కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు.

Related posts

డేంజర్ జోన్ లోకి చేరుతున్న కామారెడ్డి

Satyam NEWS

ఆడ‌బిడ్డ‌ల‌కు అభ‌య‌హ‌స్తం…దిశ యాప్…!

Satyam NEWS

ప్ర‌శంసా ప‌త్రం…న‌గ‌దుతో సిబ్బందికి అభినందనలు

Satyam NEWS

Leave a Comment