ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాజధాని అంశంపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. రేపటి నుంచి మధ్యంతర పిటిషన్ లను విచారించనున్నారు.
మూడు రాజధానులకు సంధించి హైకోర్టులో దాఖలైన 223 మధ్యంతర పిటీషన్లలో 189 స్టే కోసం వేసినవి. దీంతో మిగిలిన 34 పిటీషన్లను ముందుగా విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది.
ప్రత్యేక హోదాకు సంబంధించిన కేసులను కూడా ఫుల్ బెంచ్ స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలు వినిపించగా, రైతులు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపించారు.